– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జర్నలిస్టు మునీర్ మరణం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకులు అబ్రహం నాయకత్వంలో మునీర్ ఏఐవైఎఫ్ నాయకులుగా బాగా అభివృద్ధి చెందారనీ, ఆ తరుణంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. కార్మికుల కోసం సమ్మె చేసిన సందర్భంలో దాదాపు ఏడుగురు కాల్పుల్లో చనిపోయారు.
ఆ ఉద్యమానికి అబ్రహం, మునీర్ లాంటి వారు నాయకత్వం వహించారని అన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుగా మారి రోజు అనర్గళంగా వ్యాసాలు రాసే గొప్ప వ్యక్తి అనీ, ఏ అంశంపైనైనా వ్యాసాలు రాసే జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొందారన్నారు. వ్యక్తిగతంగా తనకు 1980 నుంచి మునీర్తో సంబంధాలు ఉన్నాయని సాంబశివరావు ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తమ కమ్యూనిస్టు నాయకుడు, ఉత్తమ కార్మిక నాయకుడు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ సామాజిక ఉద్యమకారున్ని కోల్పోవడం చాలా బాధారకమని అన్నారు.
జర్నలిస్టు మునీర్ మరణం బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES