- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు ,ఈనెల 30 న నిజామాబాద్ ,కామారెడ్డి జిల్లాల ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాల బాలికల జూడో రాష్ట్రస్థాయి క్రీడల కొరకై సెలక్షన్స్ నిజామాబాద్ డి ఎస్ ఏ స్విమ్మింగ్ పూల్ నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారని నిజామాబాద్ జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు తో పాటు ఒరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని తెలిపారు. ఇంటర్మీడియట్ క్రీడాకారులు తమ వెంట ఒరిజినల్ పదవ తరగతి మార్క్స్ మెమో తీసుకురావాలని, ఈ ఎంపికల కొరకై వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ని ఈ సెల్ నంబర్ 7893973128 కు సంప్రదించాలని అన్నారు.
- Advertisement -



