Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఆర్టీసీ జేఏసీ

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఆర్టీసీ జేఏసీ

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కే.మహేందర్ రెడ్డి కోరారు. ఈనెల 7 నుంచి చేపట్టబోవు సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం దుబ్బాక పట్టణంలోని బస్సు డిపో ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పలు డిమాండ్లను ఇదివరకే ఆర్టీసీ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించడం జరిగినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఈనెల 7 నుంచి చేపట్టబోవు సమ్మెను ఆర్టీసీ కార్మికులు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ వైస్ చైర్మన్ కే.రమేష్,కన్వీనర్ ఆర్.కనకయ్య,కమిటీ సభ్యులు,కార్మికులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -