- Advertisement -
నవతెలంగాణ – కాటారం
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజల్లోకి వస్తే ఎప్పుడు బిజీగా గడుపుతారు. ఇక ప్రతిపక్ష హోదా ఉంటే మాత్రం క్షణం తీరిక ఉండదు…ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాల్సి ఉంటుంది… కొద్దిసేపు ఎక్కడైనా సరదాగా ఉండేందుకు ప్రయత్నించినా సమయం దొరకదు. కానీ ఇక్కడ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కాసేపు సరదాగా స్థానిక నాయకులతో ముచ్చటించారు. కాటారం మండలం కేంద్రం లో ఓ కార్యక్రమానికి వచ్చిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్థానిక నాయకుల తో కలిసి ఇలా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోనీ ప్రకాష్ శెట్టి టీ స్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల్లా టీ తాగుతూ ముచ్చటించారు.
- Advertisement -