– ఐటీసీ కార్మికుని కుటుంబసభ్యుల ఆందోళన
– అండగా నిలిచిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్న హరీశ్ గురువారం ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. దాంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాలు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. మృతదేహాన్ని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఐటీసీ యజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆదివాసీ సంఘ నాయకులు అండగా నిలిచారు. వెంటనే ఐటీసీ కాంట్రాక్టర్ను అక్కడికి పిలిపించి మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా కల్పించారు. హరీశ్ తల్లికి నెలకు రూ.9వేలు పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కుటుంబానికి రూ.14.50 లక్షలు ఇస్తామని కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. లక్ష రూపాయలు నగదు రూపంలో ఇవ్వగా, మూడు లక్షల రూపాయలు చెక్కు రూపంలో అందజేశారు. మిగతావి కార్యక్రమం అయిపోయిన మరుసటి రోజే ఇస్తానని కాంట్రాక్టర్ వారికి హామీ పత్రం అందజేశారు. హరీశ్ కుటుంబ సభ్యులకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES