- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
చిలుముల శివరంజని నారాయణరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కే. శివాని రాష్ట్రస్థాయి 1 కిలోమీటర్ అథ్లెటిక్ పోటీలకు జిల్లా నుండి ఎంపికయ్యారు. మంగళవారం కళాశాలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన కే. శివానిని ప్రిన్సిపాల్ పాపిరెడ్డి అభినందించారు. ప్రతిరోజు కళాశాల మైదానంలో శిక్షణ పొందుతూ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణం అన్నారు. రానున్న రాష్ట్ర స్థాయి పోటీలలో రాష్ట్రస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి ఈ డి ఎన్ ప్రసాద్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -