నూతన ప్రజాస్వామిక విప్లవమే ప్రజలకు ప్రత్యామ్నాయ సమాజాన్ని అందిస్తుంది
కామ్రేడ్ మోహనన్న వర్ధంతి సభలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ఏ ఐ కె ఎం ఎస్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : పీడిత ప్రజల హృదయాలలో నేటికీ చిరంజీవిగా నిలిచిన కామ్రేడ్ ఏనుగుల మోహనన్న నేటికీ ప్రజా ఉద్యమాలలో, గుండెల్లో నేటికీ సజీవంగానే, చిరంజీవిగానే ఉన్నాడని ఏఐకెఎంఎస్ రాష్ట్ర అద్యక్షులు మామిడాల బిక్షపతి అన్నారు. కామ్రేడ్ మోహనన్న ఎంచుకున్న, నమ్మిన నూతన ప్రజాస్వామిక విప్లవంను పరిపూర్తి చేయకుండా ప్రజలకు విముక్తి లేదని, ప్రజలకు అనుగుణమైన ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించడం అసాధ్యమని, అందుకే ఈ దేశ ప్రజలకు విప్లవం అనేది అత్యంత అవసరమని, ఇప్లవం ప్రజలకు సదా వెలుగునిస్తూనే ఉంటుందని , సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ లు అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం కమటంగూడెం, ఏ ఐ కె ఎం ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఏనుగుల మోహనన్న 10 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ మోహనన్న చిత్ర పటానికి మోహనన్న జీవిత భాగస్వామి ఏనుగుల నర్సమ్మ, కుమారులు, కూతురు ఏనుగుల ఉదయ్, ఉమా పార్టీ జిల్లా నాయకులు పూలమాలలు వేసి, సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలిపారు.
అనంతరం జరిగిన వర్ధంతి సభ లో వారు మాట్లాడుతూ, కామ్రేడ్ మోహనన్న మొదటి నుంచి చివరి వరకు ఆలేరు విప్లవోద్యమంలో ఆపద సాపద కాలంలో అలుపెరగని పోరు సాగించాడని, కుటుంబం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించిన కామ్రేడ్ మోహనన్న విప్లవ పోరాట బావుటా ను రెపరెపలాడిస్తూ విప్లవంలో సాగిపోయాడని కొనియాడారు. నక్సలైట్లే దేశ సంపదను రక్షించే, భావితరాలకు అందించే బాధ్యతాయుతమైన ప్రజా భవిషత్ మార్గనిర్దేశకులని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అన్నలను, ఆదివాసీలను చంపడమంటే బీ జే పీ మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపదను లూటీ చేసుకొనిపోయేలా బడా కార్పోరేట్ సంస్థలకు లైసెన్సు ఇవ్వడంలో భాగమేనని స్పష్టం చేశారు. ఈ దేశ ప్రజల ఆస్తులైనట్టి అటవీ ఖనిజ సంపదను బడా కార్పొరేట్ల కు, సామ్రాజ్యవాదులకు దోచిపట్టడం కోసం ఈ దేశ పౌరులు ఆదివాసులు, మావోయిస్టులను కాల్చి చంపి బీ జే పీ మోడీ ఈ దేశ ప్రజలకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఆర్.సీత, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, పీ వై ఎల్ జిల్లా అద్యక్షులు మారుజోడు సిద్దేశ్వర్, ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీకాంత్, జిల్లా నాయకులు బర్మ బాబు, మామిడాల బాలమల్లేష్, గడ్డం మంకయ్య, ఇక్కిరి శ్రీనివాస్, టంగుటూరు మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి, పిన్నపు రెడ్డి రాఘవరెడ్డి, వగ్గు మల్లయ్య, ఏనుగుల ఎల్లయ్య, సుంకే సుగుణమ్మ, గడ్డం లక్ష్మి, ముత్తమ్మ, గడ్డం యాదగిరి, ఎర్ర మల్లేష్, ఉచ్చంతల మల్లేష్, పంజాల మురళి, శికిలం కుమారస్వామి, ఆర్ ఉదయ్, తలారి వెంకటేష్, వంగాల నరసింహారెడ్డి, చిరబోయిన కొమురయ్య, మేకల వెంకటేష్, ఇంజ శ్రీనివాస్, ఇక్కిరి బీరయ్య, భూశే శ్రీశైలం, ఎర్రంబెల్లి ఐలయ్య, చిట్టే బోయిన నరసింహులు, సుంచు రాములు, వడ్డేపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.