నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ సోమవారం సరికొత్త కాంతులతో వెలిగిపోయింది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.2.23 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన లైటింగ్ సిస్టమ్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేటి సాయంత్రం 5:30 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం మరింత శోభాయమానంగా మారింది. కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యతను, వారసత్వ విలువలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, దాని నిర్మాణ సౌందర్యాన్ని కళ్ళకు కట్టేలా చేసేందుకు ఈ లైటింగ్ ప్రాజెక్టును చేపట్టారు. జాతీయతను ప్రతిబింబించే థీమ్తో ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వ్యవస్థ, రాత్రి వేళల్లో స్టేషన్ అందాలను ద్విగుణీకృతం చేస్తుంది. నిజాం కాలంలో 1916లో గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్ ముఖభాగాన్ని సుమారు 785 ప్రత్యేక లైటింగ్ ఫిక్చర్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ లైట్లు స్టేషన్ యొక్క వాస్తుశిల్పాన్ని, వారసత్వ ఆకర్షణను మరింత స్పష్టంగా ప్రదర్శిస్తాయి.
లైట్ల వెలుతర్లో మెరుస్తున్న కాచిగూడ రైల్వేస్టేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES