- Advertisement -
మాజీమంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కడియం శ్రీహరి వెన్నుపోటుకు మారుపేరని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా పార్టీలు మారుస్తారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్కు జాతిపిత గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరని అడిగితే ఎవరైనా కేసీఆర్ పేరే చెప్తారని తెలిపారు. కడియం శ్రీహరికి నైతికత ఉంటే బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
- Advertisement -



