- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డిపిఆర్ఓ ఆదేశాల మేరకు మండలంలోని కొయ్యూరు గ్రామంలో సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందంచే మత్తు పానీయాల నివారణ, ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, రోడ్డు భద్రతపై కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యులు సెగ్గం శిరీష, జాడీ సుమలత, పులి రాధిక, చిలుముల మధుబాబు, కాస స్వాతి, ఆత్మకూరు మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్, గడ్డం నాగమణి, ఓన పాకాల కుమార్, సోదారి సురేందర్, చీకట్ల శంకర్ పాల్గొన్నారు.
- Advertisement -



