– క్యాబినెట్ నిర్ణయమంటేనే సుప్రీం
– రెండు పిల్లర్లు కుంగితేనే కాంగ్రెస్ దుష్ప్రచారం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు చట్టబద్ధంగా నిర్మితమైనదనీ, క్యాబినెట్ నిర్ణయమంటేనే సుప్రీం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు తీర్చడానికే కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని నొక్కి చెప్పారు. మొదటి నుంచీ ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ విషం చిమ్ముతూనే ఉందని విమర్శించారు. నీళ్లు లేని చోట ఎలాంటి అనుమతుల్లేకుండా కాంగ్రెస్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ సర్కారు చేపట్టిందని విమర్శించారు. కేవలం 16 టీఎంసీల ప్రాజెక్టుతో లాభంలేదని ఉద్యమ సమయంలోనే చెప్పామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఏ ప్రాజెక్ట్ కట్టినా 30 ఏండ్లు పట్టేదని విమర్శించారు. మంత్రిమండలి అనుమతి, నిపుణులు, కేంద్ర జలసంఘం సూచనలు, పొరుగు రాష్ట్రం అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని స్పస్టం చేశారు. ఉత్తర తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే తలమానికమనీ, కాంగ్రెస్ సర్కారు స్పష్టత లేకుండా తప్పుడు ఆరోపణలతోనే విచారణ కమిషన్ను వేసిందని విమర్శించారు. కేసీఆర్ను ఏదో తక్కువ చేసి చూపించే కుట్రలో భాగంగానే కమిషన్ ముందుకు పిలిచారని చెప్పారు. కమిషన్పై భవిష్యత్తులో కోర్టుకెళ్లే అవకాశముందని తెలిపారు. చట్టబద్ధంగా కట్టిన ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితేనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోకుండా కేసీఆర్ను బద్నాం చేయాలని చూడటం దారుణమన్నారు. హేతుబద్దతను కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. శ్రీశైలం, కేఎల్ఐలో పంపులు మునిగిపోయినా, ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్ట్లు కూలిపోయినా కమిషన్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం చట్టబద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES