- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 17 వాలీబాల్ పోటీలకు మండలం లొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ విద్యార్థిని ప్రణతి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఈ నెల 18 తేదీ నుంచి 20 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -