- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
సీనియర్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలం లొని కలిగోట్ విద్యార్థులు భవ్య , సాన్విక ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఈ నెల 14 తేదీ నుంచి 16 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



