- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రజాకవి కాళోజి నేటి సమాజంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రధాత అని, వారి రచనలు అనేక మంది చైతన్యం వైపు నడిపించాయని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో 111 వ జయంతి సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ అనేక రచనలు చేశారన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన యోధుడు కాళోజి స్ఫూర్తి ప్రదాయిలని కొనియాడారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ హరిత దేవి, ఏపీవో అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -