– రేఖ బోయలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు
నవతెలంగాణ-హైదరాబాద్ : కల్వకుంట్ల కుటుంబానికి ‘భద్రాచలం భావోద్వేగం’పై మాట్లాడే అర్హత లేదన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, భద్రాద్రి రాములవారి కళ్యాణానికి పట్టువస్త్రాలు తీసుకెళ్లలేక మనువనితో పంపించిన ఘనత వారి కుటుంబానిదేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గ్రామాలపై ఒక్క తీర్మానం లేదు. 2014లో కవిత మాట్లాడారు… 2015లో స్టేట్మెంట్ ఇచ్చారు… తర్వాత? మౌనం.ఏ రోజు కూడా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడారా? అని ప్రశ్నించారు.
”తెలంగాణ మట్టి” అన్న వాళ్లే, అదే మట్టిని ఆంధ్రకు వదిలేశారు. భావోద్వేగం పేరు చెప్పే అర్హత మీకు ఉందా? అసెంబ్లీలో ప్రస్తావన లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ లేదు. కేంద్రానికి ఒక అడుగు లేదు. ఇవి ముంపు జాబితాలో లేనప్పటికీ ఇంకా ఆంధ్రాలో ఎందుకు ఉన్నాయి..?
బీఆర్ఎస్కి పదేళ్ల అవకాశం ఉండి కూడా ఎందుకు పరిష్కరించలేదు . ఇప్పుడు బలహీన వర్గాల పేరిట సెంటిమెంట్ డ్రామా ఎందుకు?
అని నిలదీశారు.
కాంగ్రెస్ మాత్రం ప్రతి వేదికపై భద్రాచలం గ్రామాలపై గళమెత్తింది. ప్రగతి సమావేశంలో స్పష్టమైన డిమాండ్లు చేసింది అధికారంలో ఉన్నా లేకున్నా న్యాయం కోసం వెనకడుగు వేయదన్నారు. భద్రాచలంకు గౌరవం మాటల్లో కాదు – కాంగ్రెస్ చర్యలతోనే నిజమవుతుందని తెలిపారు.
కల్వకుంట్ల కుటుంబానికి ‘భద్రాచలం భావోద్వేగం’పై మాట్లాడే అర్హత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES