Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం

పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం వరం అనినకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో చేపట్టిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన 57 మంది కల్యాణ లక్ష్మి, 25 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ల‌బ్ధిదారుల‌కు చెక్కులను అందజేశారు. అన్ని రంగాల్లో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన పేదల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి పథకం కోసం లబ్దిదారులు దళారులను ఆశ్రయించవద్దని, లబ్ధిదారులు నేరుగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.కల్యాణలక్ష్మి మంజూరులో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.

లింక్‌ రోడ్లతో గ్రామాలు పూర్తి అభివృద్ధి చెందుతాయని, రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు మండలంలోని ఈదులూరు గ్రామం నుండి కురుమర్తి వరకు 50 లక్షల నిధుల వ్యయంతో నిర్మిస్తున్న మెటల్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, డిప్యూటీ తహసీల్దార్ ఆల్బట్ ప్రాంక్లిన్, ఆర్ఐ రామారావు, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, గడుసు శంకర్ రెడ్డి, దార బిక్షం, మిట్టపల్లి శివశంకర్, పుల్లిగిల్ల అంజయ్య, నంద్యాల వెంకట్ రెడ్డి, ముక్కామల శేఖర్, చేగోని రవి ముత్యాల లింగయ్య ఎర్ర వెంకన్న తదితరులున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -