– తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న రక్తదాన సేవలకు గుర్తింపు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కు ప్రతిష్టాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2023 – 24, 2024 – 25 సంవత్సరాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కిందని ఆయన తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గుర్తింపు రావడం జరిగిందని, దీనికి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తామని అన్నారు.
ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న కామారెడ్డి వాసి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



