- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన మక్కం గంగాధర్ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన మక్కం గంగాధర్ సామాజిక సేవా కార్యక్రమాలతో, విద్యారంగంలో అనేక సేవలు అందించారు. ఈయన సేవలను గుర్తించిన న్యూఢిల్లీలోని మ్యాజిక్ బుక్ ఆఫ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్ శర్మ, యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ సిపి యాదవ్ చేతుల మీదుగా మక్కం గంగాధర్ గౌరవ డాక్టరేట్న అందుకున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తికి డాక్టర్ రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



