- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో ని సాటాపూర్ నుంచి కందకుర్తి కి వెళ్లే ప్రధాన రోడ్డు గుంతల మయమై వర్షపు నీటితో నిండుకోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అని మండల వాసులు పేర్కొంటున్నారు. రోడ్డుపై ప్రతిరోజూ వందలాది వాహనాలు వెళుతూ ఉండడంతో గుంతల మయంగా మారిన రోడ్డు పై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు పర్కొంటున్నారు. సంబంధిత రోడ్డు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి గుంతల మయంగా మారిన రోడ్డును ప్యాచ్ వర్క్ చేసి వాహనదారులకు సహకరించవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -