- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కరూర్లో జరిగిన భయంకర తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. TVK జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సహా నలుగురిపై కేసులు పెట్టారు. ఇదిలావుండగా, తొక్కిసలాటపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో TVK పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరపాలని కోరింది.
- Advertisement -