Wednesday, April 1, 2026
E-PAPER
Homeసినిమాఎవరి ఊహకి అందని 'కథనార్‌'

ఎవరి ఊహకి అందని ‘కథనార్‌’

- Advertisement -

గోకులం మూవీస్‌ బ్యానర్‌ మీద గోకులం గోపాలన్‌ నిర్మాతగా రొజిన్‌ థామస్‌ తెరకెక్కించిన చిత్రం ‘కథనార్‌’. ఈ సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్‌ సాన్‌ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్‌ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన.. చేర మహారాజుకి కుంచమున్‌ తరుపున శుభాకాంక్షలు’.. ‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’.. ‘కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం’.. ‘ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?’.. ‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’.. ‘మాయ.. ప్రపంచమే మాయ’ అంటూ సాగిన డైలాగ్స్‌తో ట్రైలర్‌ అద్భుతంగా ఉంది.
ఈ ట్రైలర్‌లో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్‌ సాన్‌, శాండీ, దేవిక, నితీష్‌ భరద్వాజ్‌, వినీత్‌, హరీష్‌ ఉత్తమన్‌, శ్రీకాంత్‌ మురళి, కులప్రీత్‌ యాదవ్‌లను చూపించిన తీరు, ఒక్కో పాత్ర, వారి లుక్‌ను రివీల్‌ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అద్భుతంగా ఉందనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఇండియన్‌ సినీ లవర్స్‌కి నెవ్వర్‌ బిఫోర్‌ అనిపించేలా సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత – గోకులం గోపాలన్‌, సహ నిర్మాతలు – బైజు గోపాలన్‌, వీసీ ప్రవీణ్‌, దర్శకత్వం – రోజిన్‌ థామస్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – కష్ణమూర్తి, రచన – ఆర్‌ రామానంద్‌, రోజిన్‌ థామస్‌, డీఓపీ – నీల్‌ డి కున్హా, ఒరిజినల్‌ స్కోర్‌, పాటలు – రాహుల్‌ సుబ్రహ్మణ్యన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – రాజీవ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -