- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె భవిష్యత్ రాజకీయాలపై దృష్టి సారించడంతో, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నామా? వచ్చారు కదా? ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -



