- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొన్న వేళ ఈరోజు ఉదయం బంజారాహిల్స్లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. కేసీఆర్కు లేఖ, బీఆర్ఎస్పై వ్యాఖ్యల తర్వాత జరిగిన కవిత భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఏయే అంశాలపై మాట్లాడబోతున్నారు? ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అనేది ఉత్కంఠగా మారింది.
- Advertisement -