Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్విచారణకు హాజరైన కేసీఆర్‌...

విచారణకు హాజరైన కేసీఆర్‌…

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. బీఆర్కే భవన్‌లో ఆయన్ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు కేసీఆర్‌తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు 114 మందిని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించింది. ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్‌రావు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad