- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆ మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
- Advertisement -