- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని నందినగర్ నివాసం నుంచి ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన వాహనానికి కార్యకర్తలు దిష్టి తీశారు. పూలు చల్లుతూ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో ఆయన ఏ అంశంపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -



