- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, వారి సలహాలు స్వీకరించిన అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆయన నిర్ణయించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -