నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్హౌస్ నుంచి బయటకొచ్చారు. అమెరికా వీసా కోసం సికింద్రబాద్లోని కాన్సులేట్ ఆఫీస్కు వెళ్లారు. ఆయన వద్దనున్న డిప్లమాటిక్ పాస్పోర్ట్ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ను తీసుకునేందుకు సికింద్రబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. కేసీఆర్ వెంట మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.
- Advertisement -