- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. విచారణ ముగియడంతో కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీశ్రావు ఉన్నారు.
- Advertisement -