నవతెలంగాణ-హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించి, 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఆర్సీబీ ఈవెంట్ మేనెజర్ ప కూడా కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మెన్ కూడా రాజీనామా చేశారు. అదే విధంగా ఈ తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు కూడా కేసును సుమోటోగా స్వీకరించి..సిద్దరామయ్య ప్రభుత్వ తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
ఈక్రమంలో కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాయి. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు తెలిపాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు రాజ్భవన్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే, సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇటీవలే సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. ఇది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం తెలిపారు. కేఎస్సీఏ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్కు వెళ్లానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా క్రికెట్ సంఘం గవర్నర్ను ఆహ్వానించినట్లు కూడా సిద్ధరామయ్య ఇటీవలే ప్రకటించారు.