- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
కిసాన్ సంగ్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని భారతీయ కిసాన్ సంగ్ జిల్లా అధ్యక్షులు గైని నాగేశ్వరరావు కోరారు. మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ మండల సమావేశం మండల అధ్యక్షులు కొప్పుల నర్సారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13 నుంచి భారతీయ కిసాన్ సంఘ్ శిక్షణ తరగతులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు సకాలంలో అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని నాగేశ్వర్ రావు, జోనల్ అధ్యక్షులు లొంక వెంకట్ రెడ్డి, కార్యదర్శి మార నారాయణరెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -