విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు : తమ నాయకుడు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మండల ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఎన్ని ఆటంకాలు ఎదురైన కిషన్ రావు పల్లి నుంచి జిల్లా కేంద్రం భూపాలపల్లి వరకు అటవీ ప్రాతం గుండా రోడ్డు నిర్మాణ పనులు అగవని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు ప్రజలను గందరగోళానికి గురిచేస్తే వారి మాటలు నమ్మవద్దని రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ చైర్మన్ దండు రమేష్, మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు.
సోమవారం మండల కేంద్రమైనా తాడిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిషన్ రావుపల్లి రోడ్డు అనుమతులు రాలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మాట్లాడ్డం సరైంది కాదని అన్నారు. ఖచ్చితంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పారు. తాడిచర్ల నుంచి నాగులమ్మ వరకు రోడ్డు పనులను ప్రభుత్వం హామ్ అనే ఏజన్సీకి అప్పజెప్పడం జరిగిందని, పనులు త్వరలో జరుగుతాయన్నారు. తాడిచర్ల నుంచి మల్లారం టు పెద్దతూండ్ల వరకు సెంట్రల్ లైటింగ్ పనులు సైతం జరుగుతాయన్నారు.
రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొయ్యుర్ లో ట్రాన్స్ పార్మర్ రిపేర్ సెంటర్ ఏర్పాటు మంత్రి కృషి చేస్తే అది అర్థం కాని పుట్ట మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. అలాగే మండలంలో త్వరలో 133/32 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ సమస్య అనేది ఉండదన్నారు. తాడిచర్ల డేంజర్ జోన్లో నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు ప్రభుత్వం చేస్తోందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం, పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బంగారు పంటలు పండే భూములను ప్రయివేటు కంపెనీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు.
పుట్ట మధు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కపట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. నియోజక వర్గంలో దళితులంతా శ్రీధర్ బాబు వెన్నంటి ఉన్నా రని, హైదరాబాదు నుంచి రాష్ట్ర దళిత నాయకులు వచ్చి శ్రీధర్ బాబు గొప్పతనాన్ని సేవలను కొనియాడన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన కలిగి పనులు చేస్తున్నారని, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిర్యాదు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో తలదూర్చిలేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా దుయబట్టారు.
గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలవరుస్తుందని, సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సీనియర్ అడ్వకేట్ల అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. చేసిన తప్పిదాలను, మోసాలను, దోపిడీలను, అన్యాయాలను, హత్యలను కప్పిపుచ్చుకోవడానికి కపట నాటకాలు ఆడుతున్నారని అన్నారు. వెంటనే ఇవి మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీసంస్థాగత నిర్మాణంలో మీ పాత్ర ఏంటని? మీ పార్టీ వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవాలని హితపు పలికారు. పుట్ట మధు ఆరో పణలు మంథని నియోజకవర్గ ప్రజలను అవమా నపరిచినట్లు ఉందని వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,డివిజన్ యూత్ నాయకుడు రాహుల్, కాంగ్రెస్ నాయకులు జంపయ్య, బండి రాజయ్య, కేశారపు చెంద్రయ్య,మేనం సతీష్,ఇందారపు చెంద్రయ్య,బొబ్బిలి రాజు,ఇందారపు ప్రభాకర్,కిషన్ నాయక్,రాగం రమేష్ పాల్గొన్నారు.