- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గురువారం కిషన్ రావు పల్లి టిడబ్ల్యూఓ భూపాల టు కిషన్ రావుపల్లి ఫారెస్ట్ రోడ్డు పనులను పెద్దతూండ్ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, గ్రామ సర్పంచ్ బండారి నర్సింగారావు, ఉప సర్పంచ్ తాళ్ల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కార్యదర్శి మండల రాహుల్, వార్డు సభ్యులు తాటికొండ కేశవ చారి, జంబోజు సంధ్యారాణి-రవిందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



