– కవిత లేఖతో గులాబీ, కమలం బంధమేంటో తేలింది
– డబ్బుల కోసమే కేసీఆర్ కుటుంబంలో కొట్లాట
– కేసీఆర్, హరీశ్రావు, ఈటలను కలిపిన ‘నోటీసులు’
– రహస్య సమావేశాలతో మళ్లీ చిగురించిన బంధం : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిపింది వాస్తవమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పే దమ్ముందా?అని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్కుమార్గౌడ్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలను పోల్చి చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని చెప్పారు. కేసీఆర్, కిషన్రెడ్డి కలవడం వల్లే బండి సంజరును అధ్యక్ష పదవి నుంచి తొలగించారని రాజాసింగ్్ పరోక్షంగా చెబుతున్నారని అన్నారు. ఆయన లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాహుల్గాంధీపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్న బీజేపీ నేతలను తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. సైనికులకు బాసటగా రాహుల్గాంధీ నిలిస్తే విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని అన్నారు. ఆ నావలో ఉన్న వస్తువుల (డబ్బుల) కోసం మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో ఎనిమిది సీట్లు ఉన్న బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలకు పరిమితమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల కోసం పంచాయితీ మొదలైందని అన్నారు. నోటీసులు రాగానే కేసీఆర్, ఈటల రాజేందర్కు పాత బంధం మళ్లీ చిగురించిందని ఎద్దేవా చేశారు. కుల సర్వే బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని చెప్పారు. కాళేశ్వరం విషయంలో నోటీసులు రాగానే బీఆర్ఎస్ నేత హరీశ్రావు శామీర్పేటలోని ఓ ఫామ్హౌస్లో ఈటల రాజేందర్తో సమావేశం అయ్యారని ఆరోపించారు. హరీశ్రావుతో కలిసి ఈటల కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. కవిత లేఖ లీక్ వెనక ఆమె ప్రమేయం ఉండొచ్చు లేదా కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్, కవిత వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం గుట్టు వీడిందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి గురించి కవిత చెప్పకనే చెబుతున్నారని తెలిపారు.
అందుకే పాకిస్తాన్తో మోడీ యుద్ధం ఆపేశారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరైన రీతిలో యుద్ధం చేయలేక అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రలోభానికి గురై వెనకడుగు వేశారని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్పై భారతదేశం చేసిన యుద్ధం తీరు తెన్నుల గురించి తెలియాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇందిరాగాంధీని అపర ఖాళీ మాత అని వాజ్పేరు కొనియాడిన విషయం కిషన్రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇందిరా గాంధీ హయాంలో వందల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని గుర్తుచేశారు. సైనిక రహస్యాలను రాజకీయ స్వార్థం కోసం బీజేపీ వాడుకొని లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రాజాసింగ్ విమర్శలకు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES