- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల కేరళ టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుని, గోపికల వేషాధారణతో అందరినీ అలరించారు. కృష్ణుడి చుట్టూ గోపికలు చేరి కోలలు వేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిర్మల జిమ్మితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -