Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కుకేటీఆర్‌ పరామర్శ

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కుకేటీఆర్‌ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం పరామర్శించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే గోపీనాథ్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపించాయి. 48 గంటలు ఆయనను అబ్జర్వ్‌లో పెట్టినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్‌ అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చి రాగానే శనివారం ఉదయం కేటీఆర్‌ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఎమ్మెల్యే మాగంటిని పరామర్శించి, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే గోపీనాథ్‌ కోలుకోవాలని ఆకాంక్షించారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, రవీందర్‌రావు, నాయ కులు మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -