- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తన పర్యటనలో భాగంగా మొదట యూకే వెళ్లనున్నారు. ఈ నెల 30న లండన్లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక “ఇండియా వీక్ 2025” సదస్సులో ఆయన ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఈ వేదికపై కేటీఆర్, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణల గురించి వివరించనున్నారు. తెలంగాణ విజయ ప్రస్థానాన్ని, అభివృద్ధి నమూనాని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయనున్నారు.
- Advertisement -