Sunday, October 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'పద్మశ్రీ' మొగులయ్య ఇంటికి కేటీఆర్‌

‘పద్మశ్రీ’ మొగులయ్య ఇంటికి కేటీఆర్‌

- Advertisement -

ఆరోగ్య పరిస్థితిపై ఆరా
అండగా ఉంటానని హామీ


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయనకు ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని చంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్‌ ఆరా తీశారు. తన కంటిచూపు మందగించిందనీ, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మొగులయ్య కేటీఆర్‌కు వివరించారు. గత ప్రభుత్వం తనకు హయత్‌నగర్‌ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ ఐ ఆస్పత్రిలో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇంటి స్థలం విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు. అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆయన భూమికి, కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కేసీఆర్‌ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -