– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– ఎమ్మెల్యే ను కలిసిన కుకునూర్ గ్రామభివృద్ధి కమిటీ, నావాబ్ కమిటీ సభ్యులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కుకునూర్ లిఫ్ట్, నావాబ్ లిఫ్ట్ లను ప్రారంభించి చెరువులు నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నందున వెంటనే గుత్ప లిఫ్ట్, చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్ కుడా ప్రారభించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆదివారం వేల్పూర్ లోని స్వగృహంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కుకునూర్ గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు, నావాబ్ లిఫ్ట్ కమిటీ సభ్యులు కలిసి నీటి విడుదల గురించి విన్నవించారు. వెంటనే స్పందించిన ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులు సీఈ మధుసూదన్, ఈఈ భాను ప్రకాష్ తో ఫోన్ లో మాట్లాడారు. లిఫ్ట్ ప్రారంభించడంలో ఉన్న ఇబ్బందులను అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
చిన్న చిన్న మారమ్మత్తులు ఉంటే వెంటనే పరిష్కరించి లిఫ్ట్ లు ఆన్ చేయాలనీ అధికారులను ఆదేశించారు. లిఫ్ట్ లు ప్రారంభించి చెరువులు నింపడానికి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.సీజన్ ప్రారభించకముందే మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయా లేనిది చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని అన్నారు..వెంటనే ట్రాన్స్ ఫార్మర్ తెప్పించి నావాబ్ లిఫ్ట్ ప్రారంభించాలన్నారు.కుకునూర్ లిఫ్ట్ లో మోటార్లు ఇసుకలో కోరుకుపోయాయని లిఫ్ట్ సభ్యులు తెలుపగా వెంటనే సమస్య పరిష్కరించి, లిఫ్ట్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 45 టీఎంసీలు ఉన్నప్పుడే చెరువులు నింపి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదన్నారు.
ఇప్పుడు వందలాది టీఎంసీలు సముద్రం పాలు అయ్యాయన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నందున వెంటనే గుత్ప, చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్ లు ప్రారభించి చెరువులు నింపాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెంటనేన్స్ లేక వెంగంటి లిఫ్ట్ సంబందించిన కాపర్ కాయిల్స్, ఇతర లిఫ్ట్ సామాగ్రి ఎత్తుకుపోయారని, వాటిని రీస్టోర్ చేసి పల్లి కొండ లిఫ్ట్ కుడా ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
కుకునూర్ లిఫ్ట్, నావాబ్ లిఫ్ట్ లను ప్రారంభించి చెరువులు నింపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES