Wednesday, October 29, 2025
E-PAPER
Homeకరీంనగర్కురిక్యాల హెచ్ఎం, అటెండర్ సస్పెన్షన్

కురిక్యాల హెచ్ఎం, అటెండర్ సస్పెన్షన్

- Advertisement -
  • – పది మంది ఉపాధ్యాయులపై బదిలీ వేటు
    – విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అటెండర్ తీరుపై ఆందోళన 
  • – గంగాధర మండల బంద్ సక్సెస్
    నవతెలంగాణ – గంగాధర
    గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పది మంది ఉపాధ్యాయులపై బదిలీ వేటు వేశారు. బాలికల ఫోటోలు తీసి మార్పింగ్ చేసి వేధింపులకు పాల్పడిన అటెండర్ ఎండి యాకుబ్ పాషాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వని పాఠశాల హెచ్ ఎంపై కూడా పోలీసులు కేసు వేశారు. ఈ సంఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట, రోడ్డుపై బైటాయించి ఆందోళనకు చేపట్టారు.

  • పాఠశాలలో  పని చేస్తున్న అటెండర్ యాకుబ్ పాషా గత ఏడాది కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడమే కాక కొందరు బాలికల ఫోటోలు తీసి మార్పింగ్ చేసినట్టు అధికారులు, పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఎండి యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనను ఉన్నతాధికారులకు నివేదించక పోగా.. వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంపై జడ్పీహెచ్ఎస్ కురిక్యాల గ్రేడ్-2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు టి. కమలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో బృందం విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది.
  • దీంతో ప్రధానోపాధ్యాయురాలు కమల విధుల నుండి సస్పెండ్ చేయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పది మంది ఉపాధ్యాయులపై బదిలీ వేటు వేశారు. అయితే జరిగిన సంఘటనను నిరసిస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో, రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ అమానుష ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయి కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మధురానగర్ చౌరస్తా రోడ్డుపై బైటాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, బీఆర్ఎస్, యువత ఇచ్చిన గంగాధర మండల బంద్ సంపూర్ణం అయ్యింది. దుకాణ సముదాయాలు, పలు షాపులు మూసివేసి బంద్ పాటించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -