Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కురుమ సంఘం ఎన్నికలు నిర్వహిస్తాం..

కురుమ సంఘం ఎన్నికలు నిర్వహిస్తాం..

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ రాష్ట్రంలో కురుమ సంఘం ఎన్నికలు జరిపించాలని నిర్ణయించామని యాదగిరిగుట్ట కురుమ సంఘం అధ్యక్షుడు కౌడే మహేందర్ తెలిపారు. శనివారం, యాదగిరిగుట్ట మండలం చోల్లేరు, కురుమ సంఘం అధ్యక్షుడు తోటకురి యాదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదగిరిగుట్ట కురుమ సంఘం అధ్యక్షుడు కౌడే మహేందర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కురుమ సంఘం ఎన్నికలు జరిపించాలని అందుకు గాను సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కావున సభ్యులందరూ 100 రూపాయలు సభ్యత్వ నమోదు రుసుము చెల్లించి ఎన్నికల సభ్యత్వం తీసుకోగలరు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపరి సంఘం అధ్యక్షుడు కుక్కల కొండ దేవేందర్, తోటకూరి నరసయ్య, గవ్వల భాస్కర్, చిన్న మల్లయ్య, తొండ గురు రవి తోటకూరి శివరాజు, చిన్నం స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -