- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జేఎసి గౌరవాధ్యక్షుడిగా నవాబు పేట గ్రామ పంచాయతీ కారోబార్ లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జేఎసి గౌరవాధ్యక్షుడిగా ఎంపిక చేసిన సంఘం సభ్యులకు తనకు సహకరించిన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు సంఘం సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏలాంటి సమస్యలు ఉన్న పోరాడతానని తెలిపారు.
- Advertisement -