- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో మండలంలోని ఎడ్లపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడుగా జనగామ లక్ష్మీరాజును ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య మంగళవారం తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పజెప్పిన మంత్రి శ్రీదర్ బాబు, శ్రీనుబాబు, బడితెల రాజయ్య, గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ కు లక్ష్మీరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టత కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



