- Advertisement -
– ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్
పారిస్ (ఫ్రాన్స్) : ప్రపంచ చాంపియన్షిప్స్ తొలి రౌండ్లోనే భారత షట్లర్ లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనా షట్లర్ షి యు కి చేతిలో 17-21, 19-21తో పోరాడి ఓడాడు. 54 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో లక్ష్యసేన్ రెండు గేముల్లోనూ పోటీనిచ్చినా.. అగ్రశ్రేణి షట్లర్ ముందు తలొంచాడు. మహిళల సింగిల్స్లో పి.వి సింధు తొలి రౌండ్లో నేడు బరిలోకి దిగనుంది.
- Advertisement -