- Advertisement -
– ఆదివాసీల ఆద్వర్యంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అశ్వారావుపేట లో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దగల కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి ఆ తర్వాత పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్ మీదుగా శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా జరిగిన సభలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. లంబాడీలను తక్షణమే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జాబితా నుంచి తొలగించే దాకా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -