- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక : భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందని తహసీల్దార్ నోముల మల్లికార్జున్ రెడ్డి అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చౌదర్ పల్లిలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా 98 మంది రైతుల నుంచి ఆర్జీలను స్వీకరించామని, మండల వ్యాప్తంగా నేటి వరకు 1319 ఆర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. కాగా ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో జరిగిన రెవిన్యూ సదస్సు పోలీసు పహారాలో కొనసాగడం గమనార్హం. ఆర్ఐ వెంకట నర్సయ్య, మాజీ సర్పంచ్ కే.కుమార్, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -