- Advertisement -
నవతెలంగాణ – రామగిరి : రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో నేడు భూ భారతి రెవిన్యూ సదస్సు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మండల తహసీల్దార్ సుమన్, ఇతర సిబ్బంది హాజరయ్యారు. అనంతరం రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను వారు స్వీకరించారు. ఈ క్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ.. భూభారతి ద్వారా మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్, దాసిపెల్లి రాజిరెడ్డి గోడిసేల సంతోష్, మండల రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -