Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

- Advertisement -

– అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సారా సురేష్ 
– పంటల సాగు కోసం నీటి సౌకర్యం కల్పించాలి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని  హాస కొత్తూర్  గ్రామంలో సర్వే నంబర్  574లో గత 20 సంవత్సరాలుగా పోడుకోట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సారా సురేష్ డిమాండ్ చేశారు. శనివారం హాస కొత్తూర్ గ్రామంలో పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్నా రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుండి భూములను సాగు చేస్తున్న రైతులు నష్టపోతూనే ఉన్నారు అన్నారు. గత 20 సంవత్సరాల క్రితం మొట్టమొదలు జట్రోప పెడితే నీటి సౌకర్యము లేక జట్రోఫా చెట్లు ఎండిపోయి రైతులు నష్టపోయారన్నారు. ఆ తర్వాత మళ్లీ సంవత్సరము ఉలువలు, ఆముదం, సోయ పంటలు వేసిన దున్నిన ఖర్చులు రాక రైతులు నష్టాల పాలయ్యారన్నారు.  ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన  నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సాగు చేసుకుంటున్న లబ్ధిదారులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో అనేకసార్లు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసి పదుల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చిన ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కబ్జాలో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మరోసారి హాస కొత్తూర్ గ్రామంలో జరుగుతున్న భూభారతి రైతు సదస్సులో లబ్ధిదారులందరికీ పట్టాలు ఇవ్వాలని లబ్ధిదారులతో కలిసి తహసిల్దారుకు వ్యక్తిగత దరఖాస్తులు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.కిషన్, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల అధ్యక్షుడు బషీరి అశోక్, మహిళా సంఘం నాయకురాలు వి.సత్యక్క, ఐక్య రైతు సంఘం మండల నాయకులు పెద్ది రాజేశ్వర్, టి.బాలకిషన్, ఢిల్లీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -