Tuesday, July 8, 2025
E-PAPER
Homeజిల్లాలుపోడు భూములకు పట్టాలు ఇవ్వాలి 

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి 

- Advertisement -

– ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దళిత రైతులు 
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దళిత రైతులు నాగరపు కిష్టవ్వ, గడ్డం మధు, సంగు బాలయ్య మాట్లాడారు. గత 60 ,70 సంవత్సరాల క్రితం నుండి భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, గత కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు పోలీసు బలగాలతో అక్కాపూర్ గ్రామంలో మేము సాగు చేసుకుంటూ బతుకుతున్న మాపై కేసులు పెట్టి, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా బోరు, మోటర్, వేసుకొని పంటలు పండించుకోని జీవనం కొనసాగిస్తున్నామన్నారు. అట్టి 50 ఎకరాల భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని, పంట పండించుకుని, బ్రతకడానికి కలెక్టర్ చొరవ తీసుకోని మాకు న్యాయం చేయాలని కోరారు. దయచేసి కలెక్టర్ 100 కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజేందర్, శ్రీనివాస్, రాజవ్వ, సంతోష్, లక్ష్మి, ఎల్లయ్య, దేవయ్య, రేణుక, రాజబాబు, సంతోష్, నితిన్, సంతోష్, రాజయ్య, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -