నవతెలంగాణ -తాడ్వాయి
దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. ఏఐసిసి అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ములుగు జిల్లా కేంద్రంలో పరిధిలోని ఇంచర్ల గ్రామంలో ఘనంగా నిర్వహిస్తుండడంతో, గురువారం మండల అధ్యక్షులు దేవేందర్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, యువజన సంఘాల నేతలు, మహిళలు పెద్ద ఎత్తున బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి భాన సంచా కాలుస్తూ టపాసులు పేల్చారు, స్వీటు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు తరలిన నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES